హైదరాబాద్ : తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,493 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,308 మంది కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 5,80,844కు పెరిగాయి. 5,44,294 మంది కోలుకున్నారు. ఇంకా 33,254 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3,296 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 94,189 శ్యాంపిళ్లను వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.