ఫౌజీ గేమ్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే మరో గేమ్.. పబ్జీ. అవును.. మన దేశంలో పబ్జీ గేమ్ను భారత ప్రభుత్వం బ్యాన్ చేశాక.. స్వదేశంలో తయారుచేయబడిన గేమ్ ఇది. దీన్ని ఈ సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేశారు. దీని పూర్తి పేరు.. ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్(Fearless and United Guards). ఈ గేమ్ను బెంగళూరుకు చెందిన స్టూడియో ఎన్కోర్ అనే సంస్థ డెవలప్ చేసింది. ఈ గేమ్ను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ కింద దీన్ని డెవలప్ చేశారు. దీన్ని రిలీజ్ చేసినప్పుడు సింగిల్ ప్లేయర్ మోడ్ మాత్రమే ఉండేది. తర్వాత దాన్ని మల్టీ ప్లేయర్ మోడ్స్లోకి మార్చారు. డెత్మ్యాచ్ టీమ్ కిందం టూ మోడ్స్గా మార్చారు.
తాజాగా.. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫౌజీ యాప్లో సరికొత్త అప్డేట్ను తీసుకొచ్చారు. ఈ అప్డేట్ వల్ల.. అన్ని మోడ్స్లో ఉచితంగా డెత్మ్యాచ్ను ఆడుకోవచ్చు. గత జూన్లోనే ఈ గేమ్కు 5వీ5 టీమ్ డెత్మ్యాచ్ మోడ్ను యాడ్ చేశారు. తాజాగా యాడ్ చేసిన ఫీచర్ వల్ల.. 10 మంది ప్లేయర్లు ఒకేసారి ఫైట్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. అది కూడా ఫ్రీ మోడ్లో. ఎవరు అయితే ఎక్కువ మందిని చంపుతారో వాళ్లే డెత్మ్యాచ్లో విన్ అయినట్టు.
ఆల్ టీమ్ డెత్మ్యాచ్ మోడ్ను 1వీ9 మోడ్ అని కూడా అంటారు. అలాగే.. సరికొత్త ఆపరేటర్ను కూడా ఫౌజీ గేమ్లో చేర్చారు. Dhillon అనే ఆపరేటర్ను ఇందులో చేర్చారు. గేమ్ స్టార్ట్ అయ్యే ముందే.. కొత్త ఆపరేటర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు.