ఖమ్మం : మాజీ శాసనసభ్యుడు, ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్ గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ మండలం పోలేపల్లిలోని గురుదక్షిణ ఫౌండేషన్ ఆవరణంలో ఉంచిన ఆయన భౌతికకాయన్ని మంత్రి పువ్వడ సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజకీయాల్లో విలువలు, సంప్రదాయాలు కడదాక పాటించిన ఓ బాటసారి తన ప్రయాణాన్ని ముగించి మన మధ్య నుంచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతుని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!