హాలియా/ నిడమనూరు/ పెద్దవూర/ గుర్రంపోడు/ త్రిపురారం/ తిరుమలగి(సాగర్)/ నందికొండ : మార్చి 29 : ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి జరుగనున్న శాసన సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్కు సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ బీఫామ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు.
హాలియా : టీఆర్ఎస్ ఉప ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పటాకులు కాల్చారు. నోముల భగత్ గెలుపు నల్లేరుమీద నడకేనని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ అన్నారు. కార్యక్రమంలో ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, పార్టీ జిల్లా నాయకుడు మలిగిరెడ్డి లింగారెడ్డి, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, అన్నెపాక శ్రీనివాస్, ప్రసాద్ నాయక్, నల్లబోతు వెంకటయ్య, బందిలి సైదులు, కాశయ్య, దోరెపల్లి వెంకటయ్య, కూరాకుల రవి పాల్గొన్నారు. అలాగే మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి స్వగ్రామమైన అనుములలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పల్లి నాగరాజు, టేకుపల్లి సైదులు, పసుల నాగేందర్, రావుల లింగయ్య, రావుల శేఖర్, కౌన్సిలర్ ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు.
నిడమనూరు : మండల కేంద్రంలో మిర్యాలగూడ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, ఆరూరి రమేశ్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఎంపీపీ బొల్లం జయమ్మ, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, నాయకులు బొల్లం రవి యాదవ్, ఉన్నం చిన్నవీరయ్య, మాచర్ల దాసు, కోమటి వెంకన్న, అల్వాల కళావతి, రావిరాల శ్రీలత, పగిళ్ల శివ పాల్గొన్నారు.
పెద్దవూర : మండలంలోని బట్టుగూడెంలో టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్, నాయకులు గాలి సైదిరెడ్డి, చెన్ను వీరారెడ్డి అహ్మద్అలీ, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
గుర్రంపోడు : మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చారు. ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జెల చెన్నారెడ్డి, రామగిరి చంద్రశేఖర్ రావు, సర్పంచ్ షేక్ మస్రత్జయ్యద్మియా, వెలుగు రవి, పగిళ్ల లాలయ్య, సింగం ప్రవీణ్, వనమాల చక్రపాణి, యడవెళ్లి రమేశ్, బుయ్య గిరి, వేముల యాదయ్య పాల్గొన్నారు.
త్రిపురారం : మండల కేంద్రంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్నాయక్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే శంకర్నాయక్ అన్నారు. నిడమనూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య, పీఏసీఎస్ చైర్మన్ జయరాంనాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్, మహిళాధ్యక్షురాలు బైరెడ్డి కవిత, సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి, నాయకులు మర్ల చంద్రారెడ్డి, రామచంద్రయ్య, జంగిలి శ్రీనివాస్, షేక్ దస్తగిరి, షేక్ సయ్యద్, కొల్లి రాము, మాతంగి నాగరాజు పాల్గొన్నారు.
నందికొండ : టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్న బ్రహ్మానందరెడ్డి, పట్టణాధ్యక్షుడు బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మంద రఘువీర్, కౌన్సిలర్ రమేశ్జీ, పట్టణ కార్యదర్శి భూషరాజుల కృష్ణ, నాయకులు నకిరేకంటి సైదులు, మంద శాంతకుమారి, సైదులు, మాధవి, షాహిన్, ఇర్ల శ్రీను, వీరయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, విష్ణుమూర్తి పాల్గొన్నారు.
తిరుమలగిరి(సాగర్) : మండలంలోని రంగుండ్లలో సర్పంచ్ బిచ్చానాయక్ ఆధ్వర్వంలో స్వీట్లు పంపిణీ చేశారు. మంగ్తానాయక్, శ్రీను, బొడ్డి, గన్యా, బిచ్చు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి..
తెలంగాణలో మలబార్ గోల్డ్ విస్తరణ
పాన్, ఆధార్ లింక్ చేయించకపోతే రూ.1000 జరిమానా..!