జ్వరం వచ్చినా.. ఏదైనా అనారోగ్య సమస్యలొచ్చినా.. వెంటనే నగరంలోని దవాఖానలకు వెళ్తాం. మనకు ఇష్టమైన డాక్టర్ వద్దే చూయించుకోవాలని తాపత్రయ పడ్తాం. మనకు న చ్చిన డాక్టర్ ఆ రోజు లేకుంటే.. మరుసటి రోజు మళ్లీ వె ళ్తాం. దీంతో డాక్టర్ ఫీజుతో పాటు తిండి, రవాణ ఖర్చులు తడిసి మోపెడవడం ఖాయం. కాని, ఇదంతా గతం. కరో నా తీవ్రతతో రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా టెలీ మెడిసిన్ సేవలకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనే కాదు మన దేశంలో, ప్రపంచంలో నిఫుణులైన డాక్టర్లు ఎక్కడ ఉన్నా.. మనము ఇంటి నుంచే వాళ్లను సంప్రదించవచ్చు. ప్రస్తుతం, దేశంలో కరోనా తీవ్రరూపం దాల్చడంతో చాలా రంగాల్లోనూ ఆన్లైన్ సేవలు పెరిగా యి. వర్కు ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు, సమావేశాలు, జూమ్ మీటింగ్లతో పాటు టెలీ మెడిసిన్, టెలీ హెల్త్ సేవ లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇంట్లోని స్మార్ట్ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు. నట్టింట్లోనే వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల సంఖ్య దేశ వ్యాప్తంగా పెరుగుతుంది. గతంలో కేవలం 20 శాతం మాత్రమే టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులో ఉంటే.. నేడు ఒక్కసారిగా 80 శాతానికి పెరిగిందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
రోగి రాష్ట్రంలో ఏదో మారుమూల గ్రామంలో ఉంటే, డాక్టర్ మాత్రం నగరంలోని ఏదో పెద్ద దవాఖానలో ఉన్నప్పటికీ ప్రస్తుతం, అందుబాటులోకి వచ్చిన ‘ఆన్లైన్, జూ మ్ యాప్, వీడియో కాలింగ్’ వంటి వసతుల ద్వారా డాక్ట ర్ నేరుగా రోగితో మాట్లాడి అవసరమైన వైద్య సూచనలతో పాటు డయాగ్నస్టిక్ ప్రిస్క్రిప్షన్ను, మెడికల్ ప్రిస్క్రిప్షన్ను కూడా డిజిటల్ రూపంలో అందిస్తున్నారు. ప్రధానం గా కార్పొరేట్ దవాఖానలతో పాటు అనేక టెలీ మెడిసిన్ ఏజెన్సీలు ఏకంగా వందలు, వేల సంఖ్యలో నిపుణులైన డాక్టర్లను నియయించుకొని టెలీ మెడిసిన్, టెలీ హెల్త్ సేవలను విస్తరించుకుంటున్నాయి. ఈ సేవలు మారుమూల ప్రజలకు సంజీవినిలా పని చేస్తాయని చెప్పొచ్చు.
కొన్ని ఏజెన్సీలు /దవాఖానలు స్థానిక వైద్యులతో ఈ-కన్సల్టెన్సీల ద్వారా డయాగ్నస్టిక్ సెంటర్లతో ఒప్పందం కు దుర్చుకుని రోగి ఇంటికి వచ్చి శాంపిల్స్ తీసుకుని డిజిటల్ మార్గాల ద్వారనే రిపోర్టులను కూడా అందిస్తున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా దవాఖానలలో అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుతుండటం, ప్రస్తుత పరిస్థితులలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు దవాఖానలకు వెళ్లడం రిస్క్తో కూడుకున్న వ్య వహారం. వీటికి తోడు దవాఖానలలో అ య్యో ఖర్చుతో పోల్చితే ఈ సేవలు తక్కు వ ధరలకే అందుతుండటంతో ప్రజలు కూడా అమితాసక్తి చూపుతున్నారు. టెలీ మెడిసిన్ సేవలు విస్తరిస్తే ప్రతి ఏట సు మారు రూ.40-50వేల కోట్ల వరకు ఆదా అవుతుందని గతంలోనే మెకన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.
2000 సంవత్సరంలో అపోలో దవాఖాన శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మొదటగా టెలీ మెడిసిన్ సేవలను అందించారు. అనంతరం, చిత్తూరు జిల్లాలోని అరగొండ ప్రాం తంలో టెలీమెడిసిన్ సేవలను అందించారు. ఇస్రో సా యంతో దేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ తదితర రాష్ర్టాల్లో టెలీ మెడిసిన్ / టెలీ హెల్త్ సేవలను అపోలో దవాఖాన యాజమా న్యం అందిస్తుంది. కన్సల్టెన్సీలతో సమన్వయం ద్వారా సుమారు 700 వరకు టెలీ హెల్త్కేర్ సెంటర్ల ద్వారా టెలీ మెడిసిన్ సేవలను అపోలో యాజమాన్యం అందిస్తుంది. అలాగే, అనేక కార్పొరేట్ దవాఖానలు టెలీ మెడిసిన్ పేరు తో యాప్లను అభివృద్ధి చేసుకున్నాయి.
పల్లెలతో పాటు ఎక్కడి నుంచైనా క్షణాల్లో దేశంలోని నిపుణులైన వైద్యుల సలహాలను పొందే వీలుంటుంది.
దవాఖానకు వెళ్లకుండానే తక్కువ ఖర్చులతో వైద్యం.
అత్యవసర పరిస్థితుల్లోను నిమిషాల్లో నిపుణులైన వైద్యుల సూచనలు/సలహాలు, వైద్య సేవలు.
దవాఖానలకు వెళ్లడం వలన కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చును.
రవాణా, దవాఖాన ఫీజుల ఖర్చుల భారం తగ్గుతుంది.
డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక వైద్యుడు ఉండాలి.
కాని, ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్ల కొరత ఉంది.
టెలీ మెడిసిన్ సేవల ద్వారా వైద్యుల కొరతను అధిగమించవచ్చు.
చిన్నారులకు ఆన్లైన్ చికిత్స చేయలేం.
ఈ విధానంతో చిన్న దవాఖానల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఒకే ఇంట్లో ఇద్దరు రోగులకు లక్షణాలు ఒకేలా ఉంటే.. ఒక వ్యక్తి మందులను ఇద్దరు వాడుతున్నారు. ఇది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.
చాలా ఏండ్ల కిందట టెలి రేడియాలజీ, టెలి డయాగ్నసిస్, సేవలను మారుమూల ప్రాంతా ల రోగులకు అందించేవారు. కాని, నేడు సాంకేతికత పెరిగింద ని క్లీనికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ చైర్మన్ డా॥ విజయ భాస్కర్ తెలిపారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన ఆయన టెలి మెడిసిన్, టెలిహెల్త్ ప్రస్తుత పరిస్థితుల్లో అని వార్యమని వివరించారు.
కిడ్నీ, క్యాన్సర్, లీవర్, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లతో పాటు వృద్ధులకు, గర్భిణులకు, మారుమూల ప్రాంతాల ప్రజలకు టెలి మెడిసిన్ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దూర ప్రాంతాల ప్రజలకు మెరుగైన సేవలను నిమిషాల్లో అందించే అవకాశం ఉంది. సాధారణంగా ఒక కుటుంబంలో దగ్గు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలకు టెలీ మెడిసిన్ సేవలలో భాగంగా ప్రిస్కిప్షన్లో మెడిసిన్ అందిస్తారు. అయితే, ఆ రోగి ఇంట్లో మరెవ్వరికైనా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా అవే మందులను వాడుతున్నట్లు తెలుస్తుంది. ఇది చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఎవ్వరు కూడా ఇలా చేయకూడదు.
కొందరు టెలీ మెడిసిన్లో పాల్గొని ఏ చిన్న లక్షణం కనిపించినా.. వెంటనే దవాఖానలకు వెళ్లి అనవసరంగా వైద్య వనరులను వాడుతున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో అవసరం ఉన్న వారికి వైద్య వనరులను అందించలేని పరిస్థితి వస్తుంది. అలాగే, ‘సిటీ స్కాన్, ఎక్స్రే, ఎమ్మారై’ వంటి పరీక్షలను అవసరం లేకున్నా చేయించుకుంటున్నారు. డబ్బులు చేయాలని పట్టుబడుతున్నారు. ఇది చాలా తీవ్రమైన ఇబ్బందులకు దారి తీస్తది. ప్రజల ఆలోచనా ధోరణి మారాలి. సిటీ స్కాన్లో కొరాడ్స్-5 అనేది నార్మల్. కాని, చాలా మంది నాకు కొవిడ్ లక్షణాలున్నాయని కార్పొరేట్ దవాఖానలో చేరి రూ.లక్షలను ఖర్చు చేస్తున్నారు. వైద్య వనరులను అనవసరంగా వినియోగిస్తున్నారు. ఆక్సిజన్ బెడ్లను ఆక్రమిస్తున్నారు. అవసరం లేకున్నా.. రెమిడిసివర్ను విరివిగా వాడటం వలన రూ.2000 ఉన్న మందును ఇప్పుడు బ్లాక్లో రూ.25000-30000 వేలకు విక్రయిస్తున్నారు.