కైరో: సూయజ్ కాలువలో నిలిచిపోయిన మెగాషిప్ ఎవర్ గివెన్ను స్వాధీనపర్చుకోవానలి ఈజిప్ట్ కోర్టు ఆదేశించింది. సూయజ్ కాలువలో నిలిచిపోయి ప్రపంచ వాణిజ్యాన్ని దాదాపు వారం పాటు నిలిపివేసింది. దాంతో వేల కోట్ల రూపాయల ఎగుమతులు, దిగుమతులు ఈ కాలువ గుండా నిలిచిపోయాయి, దాంతో తమకు పరిహారం చెల్లించాలని ఈజిప్ట్ లోని కాలువ అథారిటీ డిమాండ్ చేసింది.
తమకు పరిహారం ఇప్పటించాలంటూ సదరు అథారిటీ కోర్టుకు విన్నవించింది. దాంతో పరిహారం చెల్లించేంత వరకు ఎవర్ గివెన్ను స్వాధీనంలో ఉంచుకోవాలని ఈజిప్టు ఇస్మాయిలియా ఎకనామిక్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఓడ యజమానులు 900 మిలియన్ డాలర్లు చెల్లించే వరకు స్వాధీనం చేసుకుంటున్నట్లు కాలువ అథారిటీ అధికారులు మంగళవారం తెలిపారు.
200,000 టన్నుల బరువులు తరలించే ఎవర్ గివెన్ పడవ మార్చి 23 న ఇసుక తుఫానుకు గురై సూయజ్ కాలువలో అడ్డంగా చిక్కుకున్నది. దీనిని తొలగించేందుకు ఈజిప్టు కాలువ అథారిటీ సిబ్బంది, అంతర్జాతీయ నివృత్తి నిపుణులు ఆరు రోజుల పాటు ప్రయత్నాలు చేసి చివరకు విజయం సాధించారు.
ఈ నేపథ్యంలో కాలువకు ఇరువైపులా వందల సంఖ్యలో చిన్నాపెద్దా ఒడలు నిలిచిపోయాయి. కొన్ని పడవులు సుదూర ప్రయాణాలు చేసి టార్గెట్ చేరుకునేందుకు బయల్దేరాయి. ఎవర్ గివెన్ సూయజ్ కాలువలో ఇరుక్కుపోవడంతో అంతర్జాతీయంగా ప్రపంచ వాణిజ్యానికి అవాంతరాలు ఏర్పడ్డాయి. ఫలితంగా వేల కోట్ల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి పెద్ద మొత్తంలో నష్టాలకు గురయ్యాయి.
నాలుగు ఫుట్బాల్ మైదానాల కంటే ఎక్కువ పొడవున్న ఈ నౌక అడ్డంగా నిలిచిపోవడం వల్ల ఆసియా-యూరప్ మధ్య ప్రతిరోజూ 9.6 బిలియన్ డాలర్ల విలువైన సరుకును నిలిచిపోయిందని మారిటైమ్ డేటా కంపెనీ లాయిడ్స్ లిస్ట్ చెప్పారు. కాలువ అథారిటీ ప్రకారం, నీటి మార్గం మూసివేయబడిన ప్రతి రోజు ఈజిప్ట్ 12 నుంచి 15 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని కోల్పోయింది. కాగా, ఎవర్ గివెన్ 900 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించడంలో విఫలమైనందున కాలువ అథారిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని సూయజ్ కెనాల్ అథారిటీ చీఫ్ ఒసామా రాబీ ప్రభుత్వ పత్రిక అల్-అహ్రామ్ లో పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు రాబీ చెప్పారు.
జపాన్ యాజమాన్యంలోని ఈ ఓడను మార్చి 29 న విముక్తి పొందిన తరువాత కాలువ గ్రేట్ బిట్టర్ సరస్సులోని అన్స్ట్రక్టివ్ ఎంకరేజ్కి తరలించారు. అనంతరం కాలువకు ఉత్తర, దక్షిణ ప్రవేశ ద్వారాల వద్ద మొత్తం 420 ఓడలను క్లియర్ చేశారు.
ఓడను తప్పించే ప్రయత్నంలో భాగంగా కాలువకు తీవ్ర నష్టం వాటిల్లిందని, అలాగే పెద్దమొత్తంలో నష్టపోయామని కాలువ అథారిటీ.. కోర్టులో వాదించింది. దాంతో ఎవర్ గివెన్ను స్వాధీన పర్చుకోవాలని సదరు కోర్టు ఆదేశించింది.
జూన్ 1 నుంచి హాల్మార్క్ నగలే అమ్మాలి..
సొంత ప్రజలపైనే కెమికల్ అటాక్.. సిరియా దుర్మార్గాన్ని బయటపెట్టిన నివేదిక
కుట్టుపిండి ఆహారాలు తిన్న 500 మందికి అస్వస్థత
సీబీఐ ఎదుట హాజరైన అనిల్ దేశ్ముఖ్
మహా దార్శనికుడు భీంరావ్ అంబేడ్కర్ : చరిత్రలో ఈరోజు
భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అమెరికన్ సింగర్
టీకా వేసుకోండి.. ఎక్కువ వడ్డీ పొందండి..!
జూన్ నుంచి నిలిచిపోనున్న గూగుల్ మొబైల్ షాపింగ్ యాప్ సేవలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..