చెన్నూర్ రూరల్, మే 3 : మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ నవాజొద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన రంజాన్ తోఫాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్లోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ముస్లింలకు సోమ వారం పంపిణీ చేశారు. సోమవారం చెన్నూర్ మసీదు ఇమామ్ మౌజన్ సమక్షంలో పంపిణీ చేసినట్లు తెలిపారు. మైనార్టీలకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం, ముస్లింలకు పెద్ద పీట వేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు రంజాన్ కానుకలతో పాటు రంజాన్ తోఫాలను అందజేసిన విప్ బాల్క సుమన్కు ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, మే 3 : అయిజా గ్రూప్ ఆఫ్ కాలెజెస్ సెక్రటరీ మహబూబ్ ఆలంఖాన్ ప్రతి ఏటా నిరుపేద ముస్లింలకు అందించే రంజాన్ తోఫాను సోమవారం రాళ్లపేటలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేశ్గౌడ్ చేతుల మీదుగా అందించారు. రంజాన్ పండుగను కరోనా నిబంధనలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొండాల్రావు, మసీద్ కమిటీ అధ్యక్షుడు సబీర్, అఫ్జల్, మోయిన్, తదితరులున్నారు.