సినీ నటి, నగరి ఎమ్మేల్కే ఆర్కే రోజా కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆమె తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.రోజాకు సర్జరీ అయిన విషయం తెలుసుకున్న కేసీఆర్ .. ఫోన్లో ఆమెను పరామర్శించారు. ఆరోగ్యం గురించి ఆరా తీసారు. అలానే కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నుండి తనకు ఫోన్ రావడంతో రోజా ఆనందం వ్యక్తం చేసింది.
గత ఏడాది రోజా శస్త్ర చికిత్స చేయించుకోవలసి ఉన్నప్పటికీ, కరోనా వలన వాయిదా వేసుకుంది. మార్చి 24న జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా, సర్జరీ తప్పక చేయించుకోవలసి ఉందని వైద్యులు అన్నారు. దీంతో సర్జరీకి రెడీ అయింది. మలర్ ఆసుపత్రిలో రోజాకు రెండు మేజర్ సర్జరీలు కాగా, ఆసుపత్రిలో 7 వారాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేశారు. సర్జరీలు చేయించుకున్న ఎమ్మెల్యే రోజాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఫోన్ చేసి పరామర్శించారు.
ఇవి కూడా చదవండి..