హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖుల డ్రగ్స్ కేసు సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనేక మంది ప్రముఖుల పేర్లు ఈ కేసులో వెలుగులోకి వచ్చాయి. చార్మి, ముమైత్ ఖాన్, తరుణ్, నవదీప్, తనీష్తో పాటు పలువురి ప్రముఖులను స్పెషల్ సెల్ పోలీసులు విచారించారు. విచారణకు హాజరైన టాలీవుడ్ ప్రముఖుల రక్తం, జుట్టు, గోరు నమూనాలను కూడా పోలీసులు సేకరించారు.
హీరో రవితేజ సోదరుడు భరత్ ఓ ప్రమాదంలో మరణించిన తరువాత డ్రగ్స్ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. అతని మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు మాదకద్రవ్యాల రాకెట్టును కనుగొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విచారణ అనంతరం 2 జులై, 2017న 11 మంది టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి 30 మందిని అరెస్టు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి అనేక మంది డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.
సమగ్ర దర్యాప్తు అనంతరం తెలంగాణ పోలీసులు కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కోర్టు ఆమోదించింది. సరిగ్గా నాలుగు సంవత్సరాల తరువాత న్యాయస్థానం 11 మంది టాలీవుడ్ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం వెలువరించింది.