కడెం, ఏప్రిల్ 2: అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని, అటవీ సంపదను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎఫ్డీవో కోటేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఎన్డీసీఐ ఆదేశాల మేరకు కడెం మండలంలోని ఉడుంపూర్ రేంజ్ కార్యాలయంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని రాంపూర్, మైసంపేట గ్రామాల ప్రజలకు గ్యాస్ సిలిండర్లను, స్టౌవ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వోలు రమేశ్, చోలే అనిత, ఎండీ నజీర్ఖాన్, రామకృష్ణ, వినాయక్, డీఆర్వోలు, ఎఫ్ఎస్వోలు, ఎఫ్బీవోలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు హపావత్ రాజేందర్, సర్పంచ్లు వేణు, ఒర్సు వెంకటేశ్, స్థానిక నాయకులు, అటవీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
పెంబి, ఏప్రిల్ 2: మండలంలోని పెంబి, లొతొర్యతండా గ్రామాల్లో పెంబి, తాండ్ర రేంజ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అటవీ అధికారులు ర్యాలీ తీశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లోత్యొతండా వాసులతో సమావేశం నిర్వహించారు. అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఎఫ్ఆర్వోలు రామకృష్ణ, నజీర్ఖాన్ మాట్లాడుతూ అడవిలోని చెట్లను నరికినా, వన్య ప్రాణులను వేటాడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శాంకీబాయి. ఎఫ్ఎస్వోలు కింగ్ఫిషర్, ఎఫ్బీవోలు, నాయకులు బానవత్ విలాస్, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు.