ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ జియోమీకి చెందిన సూపర్ స్టైలిష్ మోడల్ బ్లాక్ షార్క్ నుంచి సరికొత్త వేరియంట్ ఫోన్ త్వరలో విడుదల కాబోతోంది. బ్లాక్ షార్క్ 4ఎస్ మోడల్ ఫోన్ను అక్టోబర్ 13న చైనా మార్కెట్లో విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే బ్లాక్ షార్క్ సిరీస్లో 4, 4ప్రో మోడల్ ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో 4ఎస్ మోడల్ ఫోన్ను విడుదల చేస్తోంది. బ్లాక్ షార్క్ మోడల్ ఫోన్లు కేవలం గేమింగ్ కోసం రూపొందించవి. స్పెషల్గా గేమింగ్ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.
6.67 ఇంచ్ సామ్సంగ్ ఈ4 ఏఎంవోఎల్ఈడీ స్క్రీన్, 144 హెచ్జెడ్ రీఫ్రెష్ రేట్, 720 హెచ్జెడ్ టచ్ సాంప్లింగ్, డైనమిక్ హిడెన్ ఫంక్షన్, యోకు ఫ్రేమ్, 120 ఎఫ్పీఎస్ అల్ట్రా హై డెఫినిషన్ ఆడియో, వీడియో, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 888 ప్లస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 120 డబ్ల్యూ అల్ట్రా ఫాస్ట్ ఫ్లాష్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది. భారత్లో ఈ ఫోన్ విడుదల తేదీ గురించి ఇంకా జియోమీ ప్రకటించలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Flipkart Big Billion Days Sale : ఈ అర్ధరాత్రితో ముగియనున్న సేల్.. లాస్ట్ మినట్ డీల్స్ ఇవే
Windows 11 : విండోస్ 11 అత్యంత సురక్షితమైనవి.. ఎందుకంటే?
Jio Offer | నెట్వర్క్ సమస్యలు ఎదుర్కొన్న యూజర్లకు జియో బంపర్ ఆఫర్
Telegram | వాట్సాప్ డౌన్.. పండగ చేసుకున్న టెలిగ్రామ్.. భారీగా కొత్త యూజర్లు
OnePlus 9RT : త్వరలో భారత మార్కెట్లోకి వన్ప్లస్ 9ఆర్టీ.. ఫీచర్లు ఇవే