రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
14వ డివిజన్లో ప్రచారం
కాశీబుగ్గ, ఏప్రిల్ 26 : ఎస్ఆర్నగర్లోని అర్హులందరికీ డబుల్బెడ్రూమ్ ఇండ్లు అందిస్తామని, ఖాళీ స్థలం ఉన్న వారికి ఇల్ల్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షల రుణ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం 14వ డివిజన్లోని ఎస్ఆర్నగర్లో ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థి తూర్పాటి సులోచనను అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతం లో చేసిన అభివృద్ధిని చూసి భారీ మెజార్టీతో సులోచనను గెలిపించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పేదల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. తూర్పాటి సులోచనతోనే డివిజన్ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఎస్ఆర్నగర్ ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, త్వరలోనే ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సౌకర్యార్థం అంతర్గత రోడ్లు, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామన్నారు.
అలాగే, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. గతంలో కార్పొరేటర్గా తూర్పాటి సులోచనా సారయ్య చేసిన అభివృద్ధిని చూసి మళ్లీ ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. అలాగే, ఎన్టీఆర్నగర్, చాకలి ఐలమ్మనగర్, ఇందిరమ్మకాలనీ, రెడ్డికాలనీల్లో కూడా ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య, డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, ప్రధాన కార్యదర్శి పత్రి సుభాష్, గండ్రాతి భాస్కర్, నాయకులు పత్రి రాజపోశాలు, సిలువేరు శ్రీనివాస్, కేతిరి రాజశేఖర్, మచ్చర్ల స్టాలిన్, పసులాది మల్లయ్య, జంగం రాజు, కొత్తపల్లి యాదగిరి, నగేశ్, ఈర్ల కుమార్, కరెంట్ నాగరాజు, భూక్యా శంకర్నాయక్, దుబ్బ శ్రీనివాస్, తూర్పాటి పూర్ణచంద్, ప్రభాకర్, అఫ్జల్, సలీం తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ రూ.47 వేల దిగువకు పుత్తడి ధరలు
అమెరికా నుంచి ఢిల్లీకి చేరిన 318 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు