మహబూబాబాద్: టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కార్మిక సంఘాల నేత, మహబూబాబాద్ జిల్లా తొరూరు మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ మాడ్గుల నట్వర్(56) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నట్వర్ తొలుత బైక్ మెకానిక్గా జీవనాన్ని ప్రారంభించి స్వయంకృషితో రాజకీయ నేతగా ఎదిగారు.
నట్వర్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నట్వర్ మృతికి మంత్రి ఎరబెల్లి దయాకర్రావు సంతాపం తెలిపారు. మంచి ఆప్తున్ని కోల్పోయామని, ఆయన అకాల మరణం తనను కలిచివేసిందని ఎరబెల్లి, ఆయన సతీమణి ఉష తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
కన్నతల్లి కర్కశత్వం..కూతురు గొంతు కోసిన తల్లి
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం
రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి