హరారే: ఫవద్ ఆలమ్ (108 నా టౌట్) శతక్కొట్టడంతో పాటు ఇమ్రా న్ భట్ (91) రాణించడం తో జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ పటిష్ట స్థితిలో నిలిచింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 374 పరుగులు చేసిన పాక్ 198 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆలమ్తో పాటు హసన్ అలీ (21) క్రీజలో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్లలో డొనాల్డ్ ట్రిపానో మూడు వికెట్లతో రాణించాడు. కాగా తొలి ఇన్నింగ్స్లో జింజాబ్వే 176 పరుగులకే ఆలౌటైంది.