ముంబై : మహారాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లా నాలా సోపారాలో నైజీరియాకు చెందిన డ్రగ్స్ విక్రేతను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుండి 478 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ మార్కెట్లో సుమారు రూ.95.65 లక్షలుగా సమాచారం. నిందితుడిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.