స్వాతంత్య్ర దినోత్సోవం సందర్భంగా అమెజాన్.. గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తోంది. అది ఈరోజు నుంచే అంటే ఆగస్టు 5 నుంచే ప్రారంభం అయింది. ఆగస్టు 9 వరకు 5 రోజుల పాటు అమెజాన్.. గ్రేట్ ఫ్రీడం సేల్ను నిర్వహించనుంది.
ఈ సేల్లో భాగంగా.. మొబైల్ ఫోన్లు, లాప్ టాప్లు, అమెజాన్ డివైజ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల మీద భారీ డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్నవాళ్లకు అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
ఈసేల్లో బెస్ట్ ఆఫర్స్తో లభించే ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఐఫోన్ 11ను కేవలం 49,999 రూపాయలకే ఈ సేల్లో అందిస్తున్నారు. అలాగే.. ఐఫోన్ 12ను 67,999 రూపాయలకు అందిస్తున్నారు. అలాగే.. వన్ ప్లస్ 9 5జీ, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20, నోకియా జీ20 ఫోన్ల మీద భారీ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది.
ఇతర గ్యాడ్జెట్స్ ఫైర్ టీవీ స్టిక్, యాపిల్ వాచ్ ఎస్ఈ, సోనీ డబ్ల్యూహెచ్ – 1000ఎక్స్ఎం3 వైర్లెస్ హెడ్ఫోన్స్, యాపిల్ ఎయిర్ పాడ్స్ ప్రో, యాపిల్ వాచ్ సిరీస్ 6, యాపిల్ ఐపాడ్ ఎయిర్ 2020, హెచ్పీ పెవిలియన్ 15 ఇంచ్ గేమింగ్ లాప్ టాప్ మీద అద్భుతమైన ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది.