అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజుతో ముగియనుంది. ఆగస్టు 5న ప్రారంభమైన ఈ సేల్.. ఆగస్టు 9న అంటే ఈరోజు రాత్రి 12 గంటలకు ముగియనుంది. అయితే.. గత 4 రోజుల కంటే కూడా సేల్ ముగింపు సందర్భంగా ఇవాళ అమెజాన్.. మొబైల్స్, గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ముగింపు సందర్భంగా అమెజాన్.. వేటి మీద బెస్ట్ ఆఫర్లను అందిస్తోందో తెలుసుకుందాం.
ఐఫోన్ 11 ను 48,999 రూపాయలకే అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర రూ.54,900. ఎక్స్చేంజ్లో అయితే 13,400 రూపాయలు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. ఎస్బీఐ కార్డు ఉంటే.. మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఐఫోన్ 12 రూ.67,999, వన్ ప్లస్ 9 5జీ ఫోన్ రూ.45,999, సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 ఫోన్ రూ.54,999, నోకియా జీ20 రూ.11,990, ఫైర్ టీవీ స్టిక్ రూ. 2,799, కిండిల్ ఈ బుక్ రీడర్స్, యాపిల్ వాచ్ ఎస్ఈ రూ. 25,900, సోనీ డబ్ల్యూహెచ్ 1000ఎక్స్ఎం3 వైర్లెస్ హెడ్ ఫోన్స్ రూ. 17,990, యాపిల్ వాచ్ సిరీస్ 6 .. రూ.41,900, హెచ్పీ పెవిలియన్ 15 ఇంచ్ గేమింగ్ లాప్ టాప్ రూ.66,490 కే అమెజాన్ అందిస్తోంది.