చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా తగ్గలేదు. ప్రతిరోజూ 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కొత్తగా 25,317 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,48,346కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 483 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇక గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారి సంఖ్య కూడా 32,263గా ఉన్నది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,88,702 ఉన్నది.