హాలియా, మార్చి 29 : నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అని ఆ పార్టీ హాలియా ఇన్చార్జి, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. హాలియాలో మీడియాతో మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభీష్టం మేరకు నోముల భగత్కు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లు తెలిపారు. ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యపై నియోజకవర్గ ప్రజలకు ఉన్న ప్రేమాభిమానాలు భగత్ను అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. టీఆర్ఎస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. ఆయన వెంట ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవల్లి విజయేందర్రెడ్డి, జిల్లా నాయకుడు మలిగిరెడ్డి లింగారెడ్డి, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ వెంపటి పార్వతమ్మాశంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, వార్డు కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, అన్నెపాక శ్రీనివాస్, ప్రసాద్నాయక్, నల్లబోతు వెంకటయ్య, బందిలి సైదులు, కాశయ్య, దోరెపల్లి వెంకటయ్య, కూరాకుల రవి ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!