‘సక్సెస్లను తలకెక్కించుకొని గర్వంగా ఫీలవ్వను. పరాజయాలను మనసులో దాచుకుంటూ బాధపడను. జయాపజయాల విషయంలో నేను నమ్మే సిద్ధాంతమిదే’ అని అంటోంది కృతిసనన్. తెలుగు చిత్రసీమ ద్వారా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో అగ్రనాయికల్లో ఒకరిగా చెలామణి అవుతోంది. లాక్డౌన్ విరామాన్ని కుటుంబంతో ఆస్వాదిస్తున్న ఆమె గురువారం ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. మహేష్బాబు గురించి ఒక్క మాటలో ఏం చెబుతారని అభిమాని అడిగిన ప్రశ్నకు..‘నా తొలి సహనటుడు. చక్కటి వ్యక్తిత్వం కలిగి అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. మహేష్బాబుతో మళ్లీ సినిమా చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పింది. అలాగే ఫైవ్ ఇయర్స్ మెమొరీ బుక్లో నిత్యజీవితంలో ఎదురయ్యే సంఘటనల్ని పొందుపరుస్తుంటానని, కొన్నేళ్ల తర్వాత అవన్నీ మధుర జ్ఞాపకాలుగా అనిపిస్తాయని తెలిపింది.ఎంత బిజీగా ఉన్నా బుక్ను రాయడం మాత్రం మరువనని తెలిపింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా అని అడగ్గా ‘నేను కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా. ఈ మహమ్మారిని ఎదురించడానికి వ్యాక్సిన్ వేసుకోవడం ఒక్కటే మార్గమని నేను నమ్ముతున్నా’ అని చెప్పింది. ‘ఆదిపురుష్’ గురించి మాట్లాడుతూ తన కెరీర్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందనే నమ్మకముందని, సెట్స్లో గడిపిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని తెలిపింది. తొందరగా షూటింగ్ పునఃప్రారంభం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ‘స్వీయ నమ్మకం ఉన్నప్పుడే జీవితంలో ఎదగగలం. మనలోని భయాలను చూసి అధైర్య పడొద్దు. వాటికి మన బలాల గురించి తెలియజేయాలి’ అని కృతిసనన్ చెప్పింది.