మహబూబ్నగర్ : వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మలేషియా కు చెందిన FGV – PU ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి రేమాండ్ లీ , కంపెనీ ఉన్నతాధికారులు ఎం. రామ్మోహన్ రావు హైదరాబాద్లో మంత్రి నివాసంలో భేటీ అయ్యారు.
ఈ భేటీలో మహబూబ్నగర్ జిల్లలో ఆయిల్ పామ్ అభివృద్ధి కోసం చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్న నేపథ్యంలో కరివేన, ఉద్దండపూర్ రిజర్వాయర్ల కింద పూర్తి స్థాయిలో నీటి సరఫరా, వనరులు బాగా అభివృద్ధి చెందుతాయన్నారు.
సాంప్రదాయంగా సాగు చేస్తున్నా వరి పంటకు ప్రత్యామ్నాయ పంటగా అధిక లాభాలను ఇచ్చే ఆయిల్ పామ్ పంట సాగు చేయాలని మంత్రి రైతు సోదరులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద 15 వేల ఎకరాల్లో ఈ ఆయిల్ పామ్ పంట సాగుచేయడానికి రైతు సోదరులకు అవగాహన కల్పిస్తామన్నారు.
త్వరలో జిల్లాకు చెందిన సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి రైతులకు ఆయిల్ పామ్ పంటపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో ‘గుడ్ఫ్రైడే’
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్కు ఈసీ ఆదేశం
వైభవంగా వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి