ముంబై : సెప్టెంబర్ నాటికల్లా తమ సంస్థ నుంచి రెండో కోవిడ్ వ్యాక్సిన్ను విడుదల చేయాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భావిస్తున్నది. ఈ మేరకు ఆ సంస్థ సీఈఓ అదర్ పూనవాలా శనివారం ట్విట్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కొవిడ్-19 కు వ్యతిరేకంగా రెండవ వ్యాక్సిన్ను విడుదల చేయాలని తమ సంస్థ భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీరం, యూఎస్ వ్యాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీ నోవావాక్స్ తయారు చేసిన ఈ రెండవ టీకా.. కోవోవాక్స్ పరీక్షలు ఈ వారంలో భారతదేశంలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
జూన్ నాటికి కోవోవాక్స్ ప్రారంభించాలని భావిస్తున్నట్లు గతంలో పూనవాలా చెప్పారు. అయితే, కొన్నికారణాల వల్ల సెప్టెంబరు నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉందని ఈ మధ్యాహ్నం ట్వీట్ చేశారు. కొవిడ్ టీకా-యూకే పరిశోధనలో 89.3 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఆఫ్రికన్, యూకే వేరియంట్లకు వ్యతిరేకంగా పరీక్షించారు.
‘కోవోవాక్స్ ట్రయల్స్ చివరకు భారతదేశంలో ప్రారంభమయ్యాయి. టీకా @ నోవావాక్స్, @సీరంఇన్స్ట్ఇండి భాగస్వామ్యంతో తయారు చేయబడింది. ఇది ఆఫ్రికన్, యూకే వేరియంట్ల కొవిడ్-19 కు వ్యతిరేకంగా పరీక్షించబడింది. మొత్తం 89 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. 2021 సెప్టెంబర్ నాటికి ప్రారంభించాలని ఆశిస్తున్నా’ అని అదర్ పూనవాలా ట్వీట్లో పేర్కొన్నారు.
భారతదేశంలో వ్యాక్సిన్ల కొరత ముప్పు లేనందున టీకా డ్రైవ్ పూర్తిస్థాయిలో జరుగుతుండటంతో.. సంస్థ తన రెండవ టీకా ప్రాజెక్టుకు వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది. పుణె దవాఖానలో గురువారం ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన హమ్దర్ద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కూడా ఈ విచారణలో భాగంగా ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా 19 కేంద్రాల్లో జరుగుతున్నది. ఇందులో 1,140 మంది పాల్గొంటున్నారు.
కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారతదేశం ఇతర దేశాలకు మద్దతు ఇవ్వడంతోపాటు కోవిషీల్డ్ వ్యాక్సిన్ను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నది. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ కార్మికులకు ప్రాధాన్యం ఇచ్చి జనవరి 16 న భారతదేశం.. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్ను ప్రారంభించింది. టీకా కోసం బహిరంగ రోల్ అవుట్ కూడా మొదలైంది. 60 ఏండ్ల వయసు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారికి మార్చి 1 న టీకా డ్రైవ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్ల వయసు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కూరలో విలువైన ముత్యం.. థాయ్ పేదింటి మహిళకు అదృష్టం
సవతి కూతురుపై ఐదేండ్లుగా లైంగికదాడి.. సర్దానాలో షాకింగ్ న్యూస్
చట్టసభల్లో నిర్మాణాత్మక, ప్రయోజనాత్మక చర్చలు జరగాలి : వెంకయ్య
అత్యంత ఘోర విమాన ప్రమాదం.. 583 మంది దుర్మరణం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..