న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికలపై తప్పుడు ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతిపెద్ద బాధితుడు అని కేంద్ర న్యాయ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. 20 ఏండ్లకు పైగా ఆయనకు వ్యతిరేకంగా అబద్దాల ప్రచారం సాగుతున్నదని అన్నారు.
గురువారం ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్-2021లో రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. సోషల్ మీడియా వేదికలకు స్వచ్ఛంద నియంత్రణ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుందన్నారు. విమర్శలను, అసమ్మతిని అనుమతినిస్తుందని తెలిపారు.
భారతదేశంలోని సాధారణ ప్రజలకు సోషల్ మీడియా సాధికారిత కల్పించిందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. కానీ సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి అతిపెద్ద సోషల్ మీడియా వేదికలను నియంత్రించడానికి ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేస్తుందన్నారు.
ఈ నాడు కొంత మంది కొన్ని అంశాలపై సానుకూల తీర్పు ఆశిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఒకవేళ వారికి అనుకూలంగా తీర్పు రాకపోతే.. సదరు జడ్జిలను ట్రోల్ చేస్తూ.. సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం దేశ ప్రజల కోసం పని చేస్తున్నదని, కొంత మంది వ్యక్తిగత విమర్శలు దేశ ప్రజలందరికి వర్తించబోవన్నారు.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఐసీఐసీఐ సంచలనం
వచ్చే ఏడాది వరకూ ఇంతే.. కొవిడ్-19 ఎఫెక్ట్పై మెజారిటీ సీఈవోలు
చందా కొచర్కు రిలీఫ్.. ఆమె భర్త దీపక్కు బెయిల్