నిజాంసాగర్, మార్చి 23 : ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 31 వరకు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని అచ్చంపేట, జక్కాపూర్ గ్రామాల్లో పౌష్టికాహారంతో కలిగే లాభాలను తెలుపుతూ పలు విధుల గుండా మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలల్లోని విద్యార్థులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు విజయ, రోజా, సాయవ్వ తదితరులు పాల్గొన్నారు.
దేమెకలాన్లో..
తాడ్వాయి, మార్చి 23 : మండల పరిధిలోని దేమెకలాన్ గ్రామంలో అంగన్వాడీ సిబ్బంది పోషకాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళలకు వంటల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పౌరాజు, ఉపసర్పంచ్ ఇందిర, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీ
ఎల్లారెడ్డి, మార్చి 23: పోషణ పక్వాడా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని హరిజనవాడ అంగన్వాడీ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీచర్ పద్మ పోషకాహారంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీచర్ శోభ, పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి..
గాంధారి, మార్చి 23: మండలంలోని నేరల్, చెన్నాపూర్ గ్రామాల్లో విద్యార్థులు, ప్రజలకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అంగన్వాడీ టీచర్లు సావిత్రి, లత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నేరల్ సర్పంచ్ సుజాత, చెన్నాపూర్ సర్పంచ్ గీతా, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ఉప సర్పంచ్ సునీత, శ్రీకాంత్రెడ్డి, సాయిలు, నానక్సింగ్, గఫూర్, లక్ష్మణ్, బాలు తదితరులు పాల్గొన్నారు.