‘మనసుల్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రమిది. సినిమా చూసిన ప్రేక్షకులంతా నవ్వుతూ థియేటర్ల నుంచి బయటకు వస్తారనే గ్యారెంటీ ఇస్తున్నా’ అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్రాజు. శిరీష్తో కలిసి ఆయన నిర్మించిన చిత్రం ‘షాదీ ముబారక్’. వీర్సాగర్, దృశ్య రంగనాథ్ జంటగా నటించారు. పద్మశ్రీ దర్శకుడు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. దిల్రాజు మాట్లాడుతూ ‘ట్రైలర్ నచ్చి నేను ఈ సినిమాలో భాగమయ్యాను. టీమ్ అందరూ కలిసి మంచి సినిమా చేశారు. నా జడ్జిమెంట్పై నమ్మకంతో శాటిలైట్, డిజిటల్ వాళ్లు సినిమా చూడకుండానే కొన్నారు’ అని చెప్పారు. ‘సినిమా రూపకల్పనలో దిల్రాజు చేసిన సహాయం మాటల్లో చెప్పలేను. ఇది దిల్రాజు సినిమా అనే మాటలో గర్వం, ధైర్యం ఉంది. నా కెరీర్కు ఓ ఛేంజ్ ఓవర్లా ఉంటుంది’ అని వీర్ సాగర్ తెలిపారు. సాగర్, దృశ్య తమ నటనతో సినిమాకు ప్రాణంపోశారని దర్శకుడు పేర్కొన్నారు.