జహీరాబాద్, ఏప్రిల్ 27 : ప్రత్యేక తెలంగాణ ఉద్యమ లక్ష్యాలను సాధించే దిశగా టీఆర్ఎస్ కృషి చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. మంగళవారం జహీరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఆవిష్కరించారు. తెలంగాణ కోసం అసువులు బాసిన అమరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 2001 ఏప్రిల్ 27న మొదలైన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సాధనకు ఎంతో కృషి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎన్నో పోరాటలు చేశారన్నారన్నారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు షేక్ ఫరీద్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, టీఆర్ఎస్ నాయకులు గడ్డం జనార్దన్, ఎండీ యాకుబ్, బాబీ పాల్గొన్నారు. అలాగే, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు గ్రామాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఉద్యమంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకున్నారు.