రాయికోడ్,మే 17 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒ వ్యక్తి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం సింగితం గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్ఐ వీరేశం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్ (28) వ్యవసాయ పొలంలో బోర్ మోటర్కు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రీకాంత్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.