స్వరాష్ట్ర నిధులతోనే ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సాయం అందజేత
కంగ్టి : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు వరంలాంటిదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక రైతువేదికలో మండలంలోని 88 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసి, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలోని బీజేపీ నాయకులు కల్యాణలక్ష్మి పథకానికి కేంద్రప్రభుత్వ నిధులను వినియోగిస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కంగ్టి నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం ఉందని, అక్కడ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుందని అక్కడి ఆడపిల్లల పెళ్లిలకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నవిషయాన్ని అక్కడి మహిళలను తెలుస్తుందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ స్వరాష్ట్ర నిధులతోనే ఆడపిల్లల పెళ్లిలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారని కొనియాడారు.
మండలంలో 30 వేల ఎకరాలకు సాగునీరందేలా ప్రభుత్వం బసవేశ్వర లిఫ్టు ఇరిగేషన్ పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఇటీవల ప్రభుత్వం రూ.1717 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు. రానున్న మూడేండ్లల్లో లిఫ్టు ఇరిగేషన్ పూర్తవుతుందని, దీంతో కంగ్టి మండలం సస్యశ్యామలం కానుందనాన్నరు. రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కంగ్టి నుంచి భీంరా మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు డబుల్రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదన చేసిందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ కోట లలిత, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కోట ఆంజనేయులు, ఎంపీపీ సంగీతావెంకట్రెడ్డి , ఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంగారం, పార్టీ ప్రధానకార్యదర్శి సంజీవ్పాటిల్, పార్టీ ఉపాధ్యక్షులు సాయౌగడ్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.