గుమ్మడిదల : జిల్లాలోని సుప్రసిద్ధశైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణమాసంలో లక్షభిల్వార్చన, ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. మండలంలోని వీరన్నగూడెంలో కొలువైన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో శ్రావణమాస పూజలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఈవో శశిధర్గుప్తా తెలిపారు.
సోమవారం నుంచి వచ్చే నెల 7వతేదీ వరకు వేదమంత్రోచ్ఛరణలతో లక్షబిల్వార్చన, రుద్రాభిషేకాలు, వీరభద్రప్రాస్తాయాలు, సత్యనారాయణస్వామి సామూహిక వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. శ్రావణమాసం సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో మొదటి రోజు ఉదయం 6గంటలకు బిందెతీర్థం, అనంతరం లింగాభిషేకాలను నిర్వహించనున్నారు. 7గంటల నుంచి 12 గంటల వరకు భక్తులతో పూజా కార్యక్రమాలను ఉంటాయన్నారు. 12గంటల నుంచి 1గంట వరకు అన్నపూజ భక్తులచే జరపనున్నారు.
2 గంటల వరకు గణపతి పూజ, రుత్వికరణ, లక్షపత్రి పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు నిత్యకల్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఈవో శశిధర్గుప్తా తెలిపారు. ఆలయాని వచ్చే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మాస్కు తప్పని సరిగా ధరంచాలి లేని యేడల ఆలయ ప్రవేశానికి లేదని ఈవో స్పష్టం చేశారు.