జహీరాబాద్, అక్టోబర్ 29 : ఎండు గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకు్నామని జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ అశోక్కుమార్ తెలిపారు. కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని బోనాస్పూర్ గ్రామనికి చెందిన గోపాల్, కోహీర్ మండలంలోని పర్శాపల్లి గ్రామనికి చెందిన రాజు సైకిల్ మోటర్ పై ఎండు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు.
సంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు వ్యక్తుల నుంచి 900 గ్రాముల ఎండ గంజాయి స్వాధీనం చేసుసుకొని నిందితులను రిమాండ్కు తరలించామన్నారు.