హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై (హెచ్ఎండబ్ల్యూఎస్) కార్మికులు దుర్మరణం చెందారు. మృతి చెందిన ఇద్దరిని అర్జున్, రాజ్కుమార్గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ హెచ్ఎండబ్ల్యూఎస్ పైపులైన్ పనులు నిర్వహిస్తుండగా బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.