న్యాల్కల్ : టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. ఆదివారం మండలంలోని మెటల్ కుంటలో టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ ఒక్కతాటిపై ఉండి మరింత కృషి చేయాలన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేసే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామన్నారు.
వచ్చేనెల 15వ తేదీన వరంగల్ లో నిర్వహించే విజయ గర్జన సభకు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలించేలా ప్రజా ప్రతినిధులు నాయకులు కృషి చేయాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండల టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎంపీపీ అంజమ్మ, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, రైల్వే బోర్డు సభ్యుడు షేక్ ఫరీద్, ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్,వైస్ ఎంపీపీ గౌస్ ఉద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, దర్శి రాజ్ కుమార్, నాయకులు ప్రవీణ్ కుమార్, భాస్కర్, నరసింహారెడ్డి, బక్క రెడ్డి, సర్పంచులు రవికుమార్, మారుతి యాదవ్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.