సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 13 : ఐటీఐలో మూడో విడత అడ్మిషన్లు చేపడుతున్నట్టు ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ అధికారి, పటాన్చెరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎన్ శ్రీనివాస్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉమ్మడ మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) లో మూడో దశ అడ్మిషన్లు ప్రారంభమైనట్టు వెల్లడించారు. ఈ నెల 22 వరకు http://iti.telangana.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.