చౌటకూర్, మే20 : లారీ కింద పడి ఓ డ్రైవర్ మృతి చెందిన విషాదకర సంఘటన తాడ్దాన్ పల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి ఉమ్మడి పుల్కల్ ఎస్ఐ కుమార గణేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ర్ర్టానికి చెందిన అంకిత్ పటేల్ (20) అనే యువకుడు గత రెండు సంవత్సరాలుగా మండలంలోని తాడ్దాన్పల్లి గ్రామ శివారులోని స్వస్తిక్ పరిశ్రమలో డ్రైవర్గా పని చేస్తున్నాడు.
కాగా, అంకిత్ పటేల్ పరిశ్రమ ముందు నిలబడి ఉన్నాడు. అదే పరిశ్రమకు చెందిన టిప్పర్ రివర్స్లో అతడిని ఢీ కొట్టింది. దీంతో అంకిత్ పటేల్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించిన అనంతరం మృతదేహాన్ని మృతుడి స్వగ్రామానికి చెందిన తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.