కంది, సెప్టెంబర్ 27 : వృత్తిరీత్యా పండ్ల వ్యాపారి అయిన ఓ యువకుడు జామ పండ్లు తేవడానికి అని వెళ్లి మృత్యువాతపడ్డాడు. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఎండీ హుస్సేన్ (29) సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి జోగిపేటలోని దన్నారం గ్రామానికి జామ పండ్లు తేవడానికి స్కూటర్పై వచ్చాడు.
ఈ క్రమంలో సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ శివారులోని కనకదుర్గ దాబా వద్ద ఎదురుగా వచ్చిన ఓ డీసీఎం వ్యాన్ అతడి స్కూటర్ను ఢీకొట్టింది. దీంతో అతడు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.