జహీరాబాద్/సంగారెడ్డి : ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని రైతులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో డివిజన్లోని చెరుకు రైతులు భారీ సంఖ్యలో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు, ఆటోలలో చెరుకు గడలను తీసుకొచ్చి ర్యాలీ నిర్వహించారు.
గత ఏడాది ట్రైడెంట్ ఫ్యాక్టరీల్లో చెరకు క్రషింగ్ చేయకపోవడంతో రైతులు కర్ణాటక, మహారాష్ట్ర, సంగారెడ్డి, కామారెడ్డిలో ఉన్న చెరుకు ఫ్యాక్టరీలకు చెరుకు తరలించి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది జహీరాబాద్ మండలంలోని కొత్తూరు బి గ్రామంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలో క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతులను ఆదుకోవాలన్నారు.
ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం భూగర్భజలాలు పెరిగిపోవడం కరెంటు సరఫరా నిరంతరంగా ఉండడంతో భారీగా చెరకు సాగు పెరిగిందన్నారు. వారం రోజుల్లోగా ఫ్యాక్టరీలో చెరుకు క్రాసింగ్ సీజన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.