సంగారెడ్డి మున్సిపాలిటీ : టీబీ లేని జిల్లాగా రూపొందించే దిశగా పనిచేస్తున్నామని, అందుకు సిబ్బంది అందరూ కష్టపడి పని చేసి టీబీ రోగులకు సేవలు అందిం చాలని జిల్లా టీబీ నిర్మూలన అధికారి డాక్టర్ జి.రాజేశ్వరి అన్నారు. మంగళవా రం డీఎంఆండ్హెచ్శో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, చికిత్స కేంద్రానికి సంబం ధించిన మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, నోడల్ అధికారులు, టీబీ హెల్త్ వర్కర్లకు ఒక రోజు శిక్షణ శిభిరాన్ని బ్రేకింగ్ ద బారియర్స్ ప్రాజెక్టు నిర్వాహకులు, టీబీ అలెర్ట్ ఇండియా సిబ్బంది నిర్వహించారు.
ఈ శిక్షణ శిభిరంలో టీబీ రోగులకు అవసరమైన విషయాలు స్టిగ్మా, చికిత్స పూర్తి, మంచి అలవాట్లు, పోషకాహారం ప్రాము ఖ్యత, కుటుంబ జాగ్రత్తలు తదితర అంశాలను కేర్ ఆండ్ సపోర్ట్ గ్రూప్ సమావేశాలు నిర్వహించి వాటి ద్వారా తెలియజే యాలని శిక్షణ అందించారు. అనంతరం టీబీ అవగాహనకు సంబంధించిన ఐఈసీ గోడపత్రికను విడుదల చేశారు. కార్యక్ర మంలో మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రాధిక, డాక్టర్ విద్య, సూపర్వైజర్లు శ్రీనివాస్రెడ్డి, దేవేందర్ రాజు, టీబీహె చ్వీ కో-ఆర్డినేటర్ చెన్నయ్య, టీబీ అలెర్ట్ ఇండియా ప్రతినిధులు పురుషోత్తం, కృష్ణ, నర్సింహులు, అనిల్ పాల్గొన్నారు.