అమీన్పూర్, సెప్టెంబర్ 27 : సాఫ్ట్వేరు ఉద్యోగి అదృశ్యమైన సంఘటన సోమవారం అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమీన్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్పూర్ మండలం బీరంగూడలోని రాఘవేంద్రనగర్ కాలనీలో నివాసం ఉంటున్న మహ్మద్ ఖాసీం కుమారుడు షేక్ షఫీయుల్లా (27) టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర ఉద్యోగిగా పని చేస్తున్నాడు.
కాగా, సోమవారం ఉదయం ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. షేక్ షఫీయుల్లా మానసికస్థితి సరిగ్గా లేదని, సైక్రియాటిక్ వద్ద అతడికి మెడిసిన్స్ కూడా వాడుతున్నటుగా పేర్కొన్నారు. ఇంట్లో నుంచి వెళ్లేప్పుడు ఆధార్ కార్డు, రూ.50 వేల నగదు తీసుకెళ్లినట్లు వెల్లడించారు. తండ్రి మహ్మద్ ఖాసీం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.