సంగారెడ్డి : పఠాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పఠాన్చెరు పట్టణంలోని నియోజకవర్గ స్థాయి సంస్థాగత సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజక వర్గ స్థాయిలో సంస్థాగత సమావేశం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు.
సెప్టెంబర్ 2వ తేదీన టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే తెలిపారు. 55 పంచాయతీలు, 3 మున్సిపాలిటీలు, 3 జీహెచ్ఎంసీ డివిజన్లలో పార్టీ శ్రేణులు టీఆర్ఎస్ జెండా పండుగ ను ఘనం గా జరపాలని ఎమ్మెల్యే కోరారు.
మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉద్యమ పార్టీ ప్రస్థానం నుంచి బంగారు తెలంగాణ సాధించే దిశగా చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.