అర్జీదారులతో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13: జిల్లాలోని అర్జీదారులు తమ భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం తమ గోడును వినిపించేందుకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ తన చాంబర్లో స్వయంగా స్వీకరించారు.
అర్జీదారుల సమస్యలను తెలుసుకొని, వారి ప్రతులను పరిశీలించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం, భూ సమస్యలపై అర్జీలను అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు ఆయా సమస్యలకు సంబంధించి కార్యాలయాల చుట్టూ తిరిగి శ్రమ, సమయం వృథా చేసుకోవద్దని, మీ-సేవా ద్వారా ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు