నాగిల్గిద్ద/ మనూర్ జూలై 6: పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, వారి భాగస్వామ్యంతోనే గ్రామల రూపురేఖలు మారుతాయని ఎంపీపీ కొంగురి జయశ్రీరెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని కమలాపూర్ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రగతి, హరితహారం నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అనంతరం పల్లె ప్రకృతి వనా న్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీడీవో షాజిలొద్దీన్. ఏపీవో వంశీకృష్ణ పాల్గొన్నారు.
ఆహ్లాదకరంగా పల్లెలు
వట్పల్లి జూలై 6 : పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమంలో భాగంగా నాగులపల్లి, పల్వట్ల, గౌతపుర్, దర్కస్తుపల్లి, నిర్జప్ల గ్రామల్లో పల్లె ప్రగతి పనులను మంగళవారం ఎంపీవో యూసుఫ్ పరిశీలించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.
గ్రామాల్లో పారిశుధ్య పనులు
న్యాల్కల్, జూలై 6 : మండలంలోని రేజింతల్, మెటల్కుంట, మల్గి, కాకిజనవాడ, హద్నూర్ తదితర గ్రామాల్లో మంగళవారం పారిశుధ్య పనులు, ముళ్లపొదలు, కలుపు మొక్కలను తొలిగించి ప్రమాదకరంగా ఉన్న గుంతలను పూడ్చివేశారు. పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో చెత్తాచెదారం, ముళ్లపొదలు, ప్లాస్టిక్ కవర్లను తొలగించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను జేసీబీలతో తొలిగించారు. ఇంటింటికీ ఆరు మొక్కలను పంపిణీ చేసి కుటుంబ సభ్యుల చేత ఇంటి పరిసరాల్లో నాటించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కుత్బుద్దీన్, ఫిటర్, మారుతీయాదవ్, శకుంతల వీరారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు కిషన్రెడ్డి, ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు.
పల్లెలు పచ్చని చెట్లతో ఉండాలి
రాయికోడ్,జూలై 6: గ్రామీణ ప్రాం తాల్లో ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతతో ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమా జం చూడగలుగుతామని మండల అభివృద్ధి అధికారి వెంకటేశం అన్నారు. మండల పరిధిలోని నల్లంపల్లి, పీపడ్పల్లి గ్రామాల్లో నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలను నాటాలన్నారు. పల్లె ప్రగతిలో అధికారులు తూతూ మంత్రంగా చే యొద్దన్నారు. అలా చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఎంపీటీసీ కృష్ణ, మండల పంచాయతీ అధికారి శ్రీకాంత్గౌడ్, మండల వ్యవసాయాధికారి అవినాష్వర్మ, టీఏ మురళి, పంచాయతీ కార్యదర్శి ఎల్లప్ప, సర్పంచ్లు విఠల్రెడ్డి, లక్ష్మీఅనీల్కుమార్, అధికారులు, మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనీల్కుమార్పాటిల్ ఉన్నారు.
మొక్కలు నాటి సంరక్షిద్దాం
ఝరాసంగం, జూలై 6: గ్రామంలో మహిళా సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు కృషి చేయాలని ఏపీఎం బాలకృష్ణ అన్నారు. మంగళవారం చిల్కేపల్లి గ్రామంలో వార్డు సభ్యులతో కలిసి డంపింగ్ యార్డు ఆవరణలో మొక్కలు నా టారు. అనంతరం ఆయన నర్సరీలో మొక్కలను పరిశీలించారు. పంచాయతీ వార్డు సభ్యులు, మహిళా సం ఘాలు, యువజన సంఘాల నాయకులు నాటిన మొక్కలను పరిరక్షించాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. ఝరాసంగంలో పలు వార్డుల్లో మురుగు చెత్తను తరలించడమే కాకుండా పరిసరాల పరిశుభ్రత పాటి స్తున్నట్లు గ్రామ ప్రత్యక అధికారి మారుతి విఠోభ అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.