పటాన్చెరు, మే 11 : పారిశుధ్య పనుల్లో ఎక్కడా రాజీపడేది లేదని, పటాన్చెరును శుభ్రంగా ఉంచుతామని కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ అన్నారు. కార్పొరేటర్ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి జీహెచ్ఎంసీ డివిజన్ 113లోని బండ్లగూడ, మార్క్స్నగర్, నేతాజీనగర్, భూపాల్రెడ్డి కాలనీల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం సభ్యులు హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నామని తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటిస్తే కరోనా దరి చేరదని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కలీం, సురేశ్రెడ్డి, కృష్ణయాదవ్, ఎల్లేశ్, శాబోద్దీన్, జబ్బార్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.