గజ్వేల్ రూరల్/కొండపాక/వర్గల్, జూన్ 15 : నర్సరీల్లో మొక్కల పెంపకం అద్భుతంగా ఉందని, పచ్చదనంతో కనివిందు చేసేలా మొక్కలు ఉన్నాయని అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని రిమ్మనగూడలో నర్సరీని ఆమె సందర్శించి సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ ప్రభుత్వం హరితహారాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, అం దు కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ ముజామిల్ఖాన్, డీఎఫ్వో శ్రీధర్రావు, డీఆర్డీవో పీడీ గోపాల్రావు, ఏపీడీ కౌసల్యాదేవి, అటవీ శాఖ రేంజ్ అధికారి కిరణ్, ఎంపీడీవో దామోదర్రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధిలో ఆదర్శం కుకునూర్పల్లి..
అభివృద్ధిలో కుకునూర్పల్లి గ్రామం రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుందని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్ అన్నారు. కొండపాక మండలం కుకునూర్పల్లి గ్రామం లో అభివృద్ధి పనులను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు చేపట్టిన సర్పంచ్ పోల్కంపల్లి జయంతి నరేందర్ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం ప్రియాంక వర్గీస్కు సర్పంచ్ జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజామిల్ఖాన్, జిల్లా పంచాయతీ అధికారి పార్ధసారథి, డీఆర్డీఏ పీడీ గోపాలరావు, డీఎఫ్వో శ్రీధర్రావు, ఏపీడీ కౌసల్యాదేవి, ఎంపీటీసీ భూములుగౌడ్, పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్, పీఎన్ఆర్ ట్రస్ట్ అధినేత నరేందర్, టీఏ సురేందర్ పాల్గొన్నారు.
మొక్కల పెంపకం బాగుంది..
నర్సరీలో యుకలిప్టస్ ట్రేలను సేకరించి కోకోఫీట్ ద్వారా మొక్కలు పెంచడం బాగుందని ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్ అన్నారు. వర్గల్ మండలం గౌరారం, సింగాయిపల్లి తదితర గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రియాంక నర్గీస్ మాట్లాడుతూ పాతపద్ధతి అయి న ప్రైమరీ బెడ్స్ ఏర్పాటుతో మొక్కల ఆరోగ్య ఎదుగుదలలో తేడాలుంటాయని తెలిపారు. కోకోఫీట్ విధానం ద్వారా మొక్కల ఆరోగ్య ఎదుగుదలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. అటవీ సంపద పరిరక్షణకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆమె వెంట ఏపీడీవో కౌసల్యాదేవి, ఎంపీడీవో మేరీస్వర్ణకుమారి, సర్పంచ్లు సంగీతావేణుగోపాల్రావు, వినోద తదితరులు పాల్గొన్నారు.