కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. వైద్య సిబ్బంది ప్రజల్లోని భయాలను తొలగిస్తూ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నారు. మెదక్ జిల్లాలో జనవరి 15న ప్రారంభించిన వ్యాక్సిన్ పంపిణీ మొత్తం 24 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్షా 47వేల 422 మందికి అందజేశారు. – మెదక్, జూన్ 19
మెదక్, జూన్ 19 : మెదక్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో 24 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్షా 47వేల 422 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం సూపర్ స్ప్రెడర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. 44 ఏండ్లు పైబడిన వారికి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎప్పుడైనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు అవకాశం ఇచ్చారు.
జిల్లాలో లక్షా 47వేల 422 మందికి టీకా..
జిల్లాలో ఇప్పటి వరకు లక్షా 47వేల 422 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. మొదటి డోస్ లక్షా 22వేల 666 మందికి.. రెండో డోస్ 24 వేల 756 మందికి వ్యాక్సిన్ వేశారు. కరోనా బారిన పడకుండా వయోజనులకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత కల్పించింది. వ్యాక్సిన్ తీసుకుంటే శారీరక సమస్యలు వస్తాయనే అపోహలతో కొంతమంది భయపడుతున్నట్లు తెలుస్తున్నది. దీనిపై వైద్య శాఖ సిబ్బంది గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయినా కూడా ఆశించిన స్థాయిలో ప్రజలు ముందుకు రావడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 45 నుంచి 59 ఏండ్లు ఉన్న వారు 73వేల 144 మంది టీకా వేసుకున్నారు. 60 ఏండ్ల పైబడిన వారు 47వేల 613 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ప్రజలు సహకరించి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ వేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
జిల్లాలో 24 ప్రభుత్వ దవాఖానల ద్వారా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జనవరి 15వ తేదీన టీకాల పంపిణీని ప్రారంభించగా, మొదట వైద్య సిబ్బంందికి వ్యాక్సిన్ వేశారు. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో ఉన్న వారికి ప్రాధాన్యతనిచ్చారు. 45 ఏండ్ల పైబడి బీపీ, షుగర్తో బాధపడుతున్న వారికి ఏప్రిల్లో టీకాలు వేశారు. ప్రస్తుతం సూపర్ స్పైడర్లకు టీకా ఇచ్చే కార్యక్రమం కొనసాగుతున్నది.
ఇప్పటి వరకు వేసుకున్న వారు లక్షా 47వేల 422
45 నుంచి 59 ఏండ్ల వారు 73వేల 144
60 ఏండ్ల పైబడిన వారు 47వేల 613
18 నుంచి 44 ఏండ్ల వారు 15వేల 815
మొదటి డోస్ తీసుకున్న వారు లక్షా 22వేల 666
రెండో డోస్ తీసుకున్న వారు 24వేల 756
ప్రతిఒక్కరూ టీకా వేయించుకోవాలి. టీకాతో ఎలాంటి అపా యం ఉండదు. టీకా విషయంలోప్రజలు అపోహలు వీడి ముందుకు రావాలి. మెదక్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతున్నది. వరకు లక్షా 47 వేల 422 మందికి టీకా వేశాం. ప్రస్తుతం సూపర్ స్పైడర్లకు టీకా ఇస్తున్నాం. కరోనా వ్యాక్సిన్తో భద్రత పెరుగుతున్నది.
-డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్వో, మెదక్