ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి
నారాయణఖేడ్, ఏప్రిల్ 16: నారాయణఖేడ్లో రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు బాధ్యతతో వ్యవహరించి తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ స్వీయ జాగ్రత్తలు పాటించడం ద్వారానే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. ప్రతిఒక్కరూ విధిగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వినియోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ మాస్క్లు ధరించని వారికి జరిమానాలు విధించడం జరుగుతుందని, మున్ముందు ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయ డం జరుగుతుందన్నారు. ఏ మాత్రం కరోనా లక్షణా లు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, 45 ఏండ్ల వయసు పైబడిన ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కరోనా పరీక్షలు చేయించుకుని పాజిటివ్గా నిర్ధారణ అయినవారు క్వారంటైన్ నియమాలను పాటించాలని, విచ్చలవిడిగా సంచరించినా, భౌతిక దూరం పాటించకపోయినా మరింత మందికి కరోనా సోకే ప్రమాదం ఉందన్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని, పొంచి ఉన్న కరోనా ముప్పును గుర్తించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ప్రజలకు సూచించారు.