చౌటకూర్, మే 5: కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం చౌటకూర్, కోర్పోల్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి డీసీఎమ్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనప్పటికీ రైతుల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి వారు ఇబ్బందులకు గురి కావొద్దని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్ధతు ధరకే కేంద్రాల్లో విక్రయించాలని తెలిపారు. వారం రోజుల వ్యవధిలో మండలంలో మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అందోల్ ఆర్డీవో విక్టర్, ఏడీఏ అరుణ, తహసీల్దార్ కిష్టయ్య, ఎంపీపీ గాజుల వీరేందర్, ఏవో చైతన్య, రైతు సంఘం అధ్యక్షుడు నర్సింహారెడ్డి, చౌటకూర్, పుల్కల్ టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు శివకుమార్,మాచర్ల విజయ్కుమార్,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మాణిక్రెడ్డి, నాయకులు దర్శన్రెడ్డి, గోవర్దన్, మల్లారెడ్డి, ఇమ్మయ్య, జాఫర్, మల్లయ్య, దేవయ్య, సత్యాగౌడ్, డీసీఎంఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
అన్నదాతలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్
కల్హేర్, మే 5: యాసంగిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమైందని జడ్పీటీసీ నర్సింహారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్, మండల పార్టీ అధ్యక్షుడు రాంసింగ్ తెలిపారు. కల్హేర్తో పాటూ నాగ్దర్, మునిగేపల్లి, దామరచెరువు, దేవునిపల్లి, ఖానాపూర్ బి, రాపర్తి గ్రామాలల్లో ఐకేపీ, పీఏసీఏస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధా న్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దని రైతులకు సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కల్హేర్, బాచేపల్లి పీఏసీఎస్ చైర్మన్లు గంగారెడ్డి, సంగారెడ్డిలు, ఎంపీటీసీ సంగప్ప, రైతు బంధు మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర ఘనీ, మార్డి పీఏసీఎస్ మాజీ చైర్మన్ జలంధర్, ఉప సర్పంచ్ సాయిలు, నాయకులు బాలయ్య, భూపా ల్, నర్సింహాగౌడ్, పి.వెంకట్రెడ్డి, బేగరి సాయిలు, ప్రశాంత్, జనార్ధన్, గూల సాయిరాం, ఏవో శశకాంత్, ఏఈవోలు భాస్కర్, సంతోష, కృష్ణవేణి, హమాలీ నాయకులు గంగారాం, సుధాకర్, రైతులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన తహసీల్దార్
అందోల్, మే 5: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని పూర్తి ధాన్యాన్ని అక్కడే విక్రయించుకోవాలని తహసీల్దార్ అశోక్కుమార్ సూచించారు. జోగిపేట మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వరికి మద్దతు ధర ఏ గ్రేడ్కు రూ. 1960. బీగ్రేడ్కు రూ. 1940 చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు మేలురకం ధాన్యం తీసుకొచ్చి మంచి మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు వసతులు కల్పించాలన్నారు. కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.