నారాయణఖేడ్, జూన్ 8: ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టుల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ దవాఖాన నిర్వాహకులు సునీల్కుమార్ సౌజన్యంతో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చేతుల మీదుగా నారాయణఖేడ్లోని జర్నలిస్టులకు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాస్కులు, శానిటైజర్లు, మాత్రలు పంపిణీ చేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కొవిడ్పై పోరా టంలో జర్నలిస్టులు నిత్యం ప్రజల మధ్య ఉండి విధులు నిర్వహిస్తున్నారన్నారు. జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం వారికి ప్రత్యేకంగా కరోనా టీకాలు వేయించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. జర్నలిస్టులు, పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద మనసుతో వారికి మాస్క్లు, శానిటైజర్లు, సంబంధిత మాత్రలను పంపిణీ చేసిన సునీల్కుమార్ను ఎమ్మెల్యే అభినందించారు. ఇదే స్ఫూర్తితో దాతలు ముందుకు వచ్చి ప్రస్తుత ఆపత్కాలంలో చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. స్థానిక డీఎస్పీ సత్యనారాయణరాజు చేతుల మీదుగా సునీల్కుమార్ పోలీసు సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
నారాయణఖేడ్, జూన్ 8: సోమవారం నారాయణఖేడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మున్సిపల్ కార్మికురాలు సత్యగామ సత్యమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి పరామర్శించారు. మంగళవారం ఎమ్మెల్యే మన్సూర్పూర్లోని సత్యమ్మ ఇంటికి వెళ్లి కుటుం బ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. సత్యమ్మ విధులు నిర్వహిస్తూ అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తేవాలని, అవసరమైన సహకారమందిస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్, మాజీ ఎంపీటీసీ మూడ రామకృష్ణ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అంబాదాస్, నాయకులు సంజీవ్రెడ్డి, తుకారాంలు ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి వారికి అందజేశారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స పొందిన నిరుపేదలను ఆదుకునే దిశగా కేసీఆర్ ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు చెప్పారు.