పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపు రేఖలు
ఒకప్పుడు అనుబంధ గ్రామం.. నేడు జీపీ
పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి
పెద్ద ఎత్తున మొక్కల పెంపకం
మెదక్ రూరల్, మార్చి 29: ప్రతి పల్లెను ఆదర్శంగా మార్చాలనే సంకల్పంతో 2019లో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దానికనుగుణంగా నిధులు కేటాయిస్తూ పల్లె అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ బాలానగర్ అభివృద్ధ్ది బాట పట్టింది. పక్కా ప్రణాళికతో ఖర్చు చేసుకుంటూ స్వచ్ఛతకు నిలయంగా మారింది. ఒకప్పుడు ఎక్కపడితే అక్కడ చెత్త కుప్పలు, పేరుకుపోయిన మురుగు కనిపించగా, పల్లెప్రగతిలో చేపట్టిన అభివృద్ధితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. డంపింగ్యార్డు, వైకుంఠధామం ,పల్లెప్రకృతి వనంతో సరికొత్త కళను సంతరించుకుంది.
మెదక్ మండలం బాలానగర్ ప్రగతి బాటన పయనిస్తున్నది. ఆర్థిక సంఘం నిధులతో పాటు పన్నుల రూపేనా ఏటా మరో రూ.65 వేల ఆదాయం వస్తుంది. అధికారులు ,ప్రజాప్రతినిధులు సమన్వయంతో నిధులను పక్కా ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రగతిలో భాగంగా పారిశుధ్య పనులు, హరితహారం మొక్కల పెంపకం, విద్యుత్ సమస్యల పరిష్కారం , పాత ఇండ్ల కూల్చివేత , పాడుబడిన బావుల పూడ్చివేత వంటి పనులు చేపట్టారు. దీంతో గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నది. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనం స్థానికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. డంపింగ్ యార్డుపూర్తి కాగా, వైకుంఠధామం నిర్మాణం చివరిదశలో ఉంది. గ్రామంలో అంతర్గత రోడ్లు , నీళ్ల పంపుల మరమ్మతు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులకు పన్నుల రూపంలో వసూలైన నిధులను వాడుతున్నారు. గ్రామస్తుల శ్రమదానం. పంచాయతీ పాలకవర్గం ప్రజాప్రతినిధుల ప్రత్యేక శ్రద్ధ. అధికారుల సమష్టి కృషితో గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడింది.
పల్లె ప్రగతితోనే మార్పు
పల్లె ప్రగతి కార్యక్రమంతోనే మా ఊరి రూపురేఖలు మారినయ్. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్తో చెత్తసేకరణకు ఇబ్బందులు తొలిగినయ్. ప్రతిరోజు పంచాయతీ సిబ్బంది ఇంటింటికీ తిరిగి చెత్తను సేకరిస్తున్నారు. జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సూచనల మేరకు ప్రణాళికలు రూపొందించుకొని గ్రామస్తులతో కలిసి పనులు పూర్తి చేసుకుంటున్నం.
వీటితో నోటి అల్సర్లు తగ్గించండి..