సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 28 : జర్నలిస్టులు, సూపర్ స్ప్రెడర్లు వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూ చించారు. శుక్రవారం పట్టణంలోని పాత జైలు వద్ద జర్నలిస్టులు, సూప ర్ స్ప్రెడర్ల కోసం వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. సంగారెడ్డిలోని 90 మంది రేషన్ డీలర్లు, 151 మంది పెట్రోల్ బంక్ డీలర్లు, 182 మంది జర్నలిస్టులు, 24 మంది ఫర్టిలైజర్ డీలర్లు, సీడ్స్ డీలర్లు మొత్తం 447 మంది సూపర్ స్పైడర్లకు వ్యాక్సిన్ అందించనున్నట్టు తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో నగేశ్, జర్నలిస్టులు, డీలర్లు, అధికారులు తదితరులు ఉన్నారు.
వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన డీఎంహెచ్వో..
పాత జైలు వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి సందర్శించారు. వ్యాక్సిన్ వేసే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంగారెడ్డిలో జర్నలిస్టులు, సూపర్ స్ప్రెడర్లు మొత్తం 447 మందికి వ్యాక్సిన్ వేయనున్నట్టు తెలిపారు. ఈ వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకొని కరోనా బారి నుంచి రక్షణ పొందాలని సూచించారు.
తారా కళాశాలలో వ్యాక్సినేషన్..
కరోనా బారి నుంచి రక్షణ పొందడానికి సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో రెండో డోస్ ప్రక్రియ కొనసాగుతున్నది. కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేసుకోవడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.