మెదక్రూరల్ మే 27: ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సర్పంచ్ రాజ్యలక్షీ రవీందర్ అన్నారు. గురువారం మెదక్ మండలంలోని వెంకటపూర్ గ్రామ పంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ రాజ్యలక్ష్మి లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడి దవాఖానల్లో చికిత్స పొందేవారికి ప్రభు త్వం సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు రవీందర్ , లబ్ధిదారులు పాల్గొన్నారు.